Honourable Minister of Civil Aviation Shri Pusapati Ashok Gajapathi Raju will visit Narsipatnam on 28th and 29th December 2017

Published: 19-12-2017,12:07:58pm

పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పర్యటనను విజయవంతం చేయాలి
నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు

నర్సీపట్నం : ఈనెల 28, 29 తేదీలలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోకగజపతి రాజు నర్సీపట్నంలో పర్యటించనున్నారని వారి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు కృషిచేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కే.సూర్యారావు అధికారులను ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి అశోక్  మంత్రి అయ్యన్న పాత్రుడు తో కలసి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి దగ్గరలో ఆయుష్ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తరువాత పోలీసు గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృధ్ధి , సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు, బ్యాంకు రుణాలు, ఎస్సీ బీసీలకు స్వయం ఉపాధి రుణాలు మంత్రి చేతుల మీదుగా అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ భవనాలు ప్రారంభోత్సవాలకు గానీ శంకుస్థాపనకు కానీ గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను అందజేసినట్లు అయితే కేంద్రమంత్రి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ఆర్డీవో తెలిపారు. బహిరంగ సభ జరిగే ప్రాంగణంలో వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.
          ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ జె. సురేంద్ర, పరిపాలనాధికారి ప్రకాశరావు , తాసిల్దార్ లు వివి రమణ,కనకారావు, తారకేశ్వరి, ఎంపీడీవోలు జయ మాధవి,, ఉదయశ్రీ, యాదగిరీ శ్వరరావు, గృహనిర్మాణ ఇంజనీర్లు వెలుగు ఉపాధి హామీ అధికారులు తదితరులు పాల్గొన్నారు,.

జారీ: డివిజనల్ పౌరసంబంధాల అధికారి,నర్సీపట్నం